News September 30, 2024
మెదక్: ఉపాధ్యాయుల సర్దుబాటు పునరాలోచించాలి: తపస్

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 25 అమలు విషయంలో పునరాలోచించాలని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా విద్యాధికారికి సోమవారం తపస్ జిల్లా అధ్యక్షులు జిడ్డు ఎల్లం, ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ ఉపాధ్యాయులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు అల్లం ఆంజనేయులు, నరేందర్, సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 24, 2025
భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్: మెదక్ కలెక్టర్

భూభారతి దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించడానికి జిల్లాలో నవంబర్ 1 వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పది రోజుల్లో సుమారుగా వెయ్యి భూభారతి దరఖాస్తులు పరిష్కరిస్తామన్నారు. ఈ డ్రైవ్లో భాగంగా కలెక్టర్ ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రతిరోజు ఒక్కో తహశీల్దార్ పది ఫైల్స్ క్లియర్ చేసి ఆర్డీవోలకు పంపించాలని తెలిపారు.
News October 24, 2025
అన్ని శాఖల అధికారులు ఫైల్స్ ఈ-ఆఫీసులోనే పంపాలి: మెదక్ కలెక్టర్

అన్ని శాఖల అధికారులు ఫైల్స్ను ఈ- ఆఫీసులోనే పంపాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,031 ఫైల్స్ను ఈ-ఆఫీసులో క్లియర్ చేశామన్నారు. మెదక్ జిల్లాలో అన్ని శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి, ఫైల్స్ను ఎవరూ కూడా తారుమారు చేయడానికి వీలు లేకుండా ప్రతిష్ఠాత్మకంగా ఈ-ఆఫీస్ ప్రారంభించి అమలు చేస్తున్నామన్నారు.
News October 24, 2025
మెదక్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే

మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఈరోజు అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రజలకు ఇబ్బంది లేకుండా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. పెండింగ్ పనులు పూర్తి చేసి మెదక్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రోడ్లు, కాలువలు, హాస్పిటల్, ఇళ్లు, పర్యావరణ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.


