News April 6, 2024
మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. సిద్దిపేట 43.9, లకుడారం 43.7, రేగోడు 43.2, చిట్యాల 43.0, దూల్మిట్ట 42.9, తుక్కాపూర్ 42.6, రాఘవపూర్ 42.4, రాంపూర్ 42.2, దామరంచ, బెజ్జంకి 42.0, రేబర్తి, కట్కూర్ 41.9, కొమురవెల్లి 41.8, సదాశివపేట, మల్చల్మ 41.6, నారాయణరావుపేట, జిన్నారం 41.5, సముద్రాల, పోడ్చన్ పల్లి 41.4, చౌటకూరు, అంగడికిష్టాపూర్ 41.2 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి
Similar News
News February 28, 2026
మెదక్: 9 నెలలు.. రూ.4,611 కోట్ల రుణాలు

మెదక్ జిల్లాలో గత 9 నెలల్లో వివిధ రంగాలకు రూ.4,611 కోట్ల రుణాలను పంపిణీ చేసి, వార్షిక లక్ష్యంలో 67.32 శాతం పూర్తి చేశామని అడిషనల్ కలెక్టర్ నగేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రైతులకు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో పెద్దపీట వేశామన్నారు. బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న రుణ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News February 28, 2026
మెదక్: మాజీ కలెక్టర్ రాహుల్ రాజ్కు ఘనంగా వీడ్కోలు

రెండేళ్ల పాటు మెదక్ కలెక్టర్గా పనిచేసి సహకార శాఖ ప్రత్యేక కమిషనర్గా బదిలీ అయిన రాహుల్ రాజ్కు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. వినూత్న పద్ధతులు, విప్లవాత్మక నిర్ణయాలతో మెదక్ జిల్లాను రాహుల్ రాజ్ రోల్ మోడల్గా నిలిపారని కొనియాడారు. పాలనలో ఆయన తనదైన ముద్ర వేశారని అధికారులు గుర్తు చేసుకున్నారు.
News February 27, 2026
ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం: కలెక్టర్ ప్రతిమా సింగ్

రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని, పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.


