News June 1, 2024
మెదక్: కౌంటింగ్ కోసం 14 టేబుల్లు ఏర్పాటు: RDO
మెదక్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కోసం 14 టేబుల్ ఏర్పాటు చేశామని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈనెల 4న నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ కోసం 14 టేబుళ్లు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందన్నారు. ఇదంతా జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.
Similar News
News September 30, 2024
ఇందిరాపార్కు ధర్నాలో మెదక్ ఎంపీ రఘునందన్
రైతులకు రుణమాఫీ, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో బీజేపీ ప్రజాప్రతినిధుల 24 గంటల రైతు హామీల సాధన దీక్ష చేపట్టారు. ఈ దీశ్రలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ ధర్నాలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
News September 30, 2024
MDK: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!
DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
మెదక్: 2720 136 1:20
సంగారెడ్డి: 3352 234 1:14
సిద్దిపేట: 3246 157 1:20
News September 30, 2024
సిద్దిపేట: ‘జిల్లాలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి తప్పనిసరి’
సిద్దిపేట జిల్లాలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి తప్పనిసరి అని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 15 వరకు జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉంటుందని, ఎలాంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. ముందస్తుగా అనుమతులు తీసుకుని ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలని సూచించారు. డీజేల నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు.