News March 13, 2025
మెదక్: గవర్నర్లు మారారు తప్ప.. ప్రసంగాలు మారలేదు: హరీశ్రావు

అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్తో చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
Similar News
News March 14, 2025
రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు: హరీశ్రావు

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం నెక్లెస్ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్గా ప్రసాద్ను ప్రతిపాదించినప్పుడు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు.
News March 14, 2025
‘ఆపదమిత్ర’ అమలుపై కలెక్టర్ సమీక్ష

మెదక్ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆపదమిత్ర పథకం అమలుపై వివిధ శాఖల ద్వారా వాలంటీర్లు, రిసోర్స్ పర్సన్స్ గుర్తింపుపై, జిల్లా యువజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో డిఆర్డిఓ, మెప్మా, హెల్త్, రెవిన్యూ, ఫైర్, మత్స్య శాఖ, ఇండస్ట్రీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్ఓ భుజంగరావు కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
News March 14, 2025
సంప్రదాయాలు పాటిస్తూ హోళీ జరుపుకోవాలి: కలెక్టర్

సంప్రదాయాలను పాటిస్తూ జరుపుకోవాలని ప్రజలకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సమానత్వానికి ప్రతీకని, ఈ రంగుల పండుగ సమాజంలో ఐక్యతను పెంపొందించేలా మారాలని, ఆనందంగా, భద్రతతో, జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా హోలీ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. హోలీ ఆడిన తదుపరి బావులు, వాగులు, చెరువులు, గోదావరిలో స్నానాలకు వెళ్ళొద్దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.