News March 4, 2025

మెదక్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ.. 24 ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి

image

కరీంనగర్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అంజిరెడ్డి 24 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6697 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 6673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.

Similar News

News November 15, 2025

HYD: శుభం, శోకంలో వారితో గండమే!

image

ఇంట్లో శుభకార్యమైనా, శోకసంద్రమైనా వారి ఆగడాలు ప్రజలకు శాపంగా మారాయి. దావత్ చేస్తే హిజ్రాలు ఆటోలో వచ్చి హంగామా సృష్టిస్తున్నారు. రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. నిరాకరిస్తే దాడులకు దిగుతున్నారు. ఇటీవల చీర్యాలలో గృహయజమానిపై జరిగిన దాడి కలకలం రేపింది. శోకసమయంలో కాటికాపరుల దుశ్చర్యలూ ఆగడం లేదు. దశదిన కర్మలకు శ్మశానాలకే వెళ్లి వేలకు వేలు గుంజేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.

News November 15, 2025

HYD: శుభం, శోకంలో వారితో గండమే!

image

ఇంట్లో శుభకార్యమైనా, శోకసంద్రమైనా వారి ఆగడాలు ప్రజలకు శాపంగా మారాయి. దావత్ చేస్తే హిజ్రాలు ఆటోలో వచ్చి హంగామా సృష్టిస్తున్నారు. రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. నిరాకరిస్తే దాడులకు దిగుతున్నారు. ఇటీవల చీర్యాలలో గృహయజమానిపై జరిగిన దాడి కలకలం రేపింది. శోకసమయంలో కాటికాపరుల దుశ్చర్యలూ ఆగడం లేదు. దశదిన కర్మలకు శ్మశానాలకే వెళ్లి వేలకు వేలు గుంజేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.

News November 15, 2025

CM పీఠంపై సందిగ్ధం.. రేపు MLAలతో నితీశ్ భేటీ

image

బిహార్ ఎన్నికల్లో NDA 202 సీట్లతో బంపర్ మెజారిటీ సాధించింది. అయితే CM పదవిపై కూటమిలో ఇంకా సందిగ్ధతే ఉంది. ఈ తరుణంలో సీఎం పీఠాన్ని ఆశిస్తున్న నితీశ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం భేటీ కానున్నారు. ‘CM పోస్టుకు వివాదరహిత వ్యక్తి నితీశ్ మాత్రమే అర్హుడు. బిహార్లో ప్రత్యామ్నాయం ఎవరూ లేరు’ అని JDU MLAలు పేర్కొంటున్నారు. కాగా ఫలితాల అనంతరం LJP నేత చిరాగ్ సహా అనేకమంది నితీశ్ నివాసానికి పోటెత్తారు.