News March 31, 2025

మెదక్: గ్రూప్ -1లో 41వ ర్యాంక్ సాధించిన శైలేష్

image

టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్ – 1 ఫలితాల్లో మెదక్ పట్టణానికి చెందిన పూనా శైలేష్ 41వ ర్యాంక్ సాధించాడు. నిన్న తుది ఫలితాలు ప్రకటించగా 503.500 మార్కులు వచ్చాయి. కాగా 1 నుంచి 7వ తరగతి వరకు మెదక్ శివ సాయి స్కూల్, 8 నుంచి 10 అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ తూప్రాన్, ఇంటర్ నారాయణ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్, డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీలో చదివాడు. కాగా, గ్రామస్థుల నుంచి శైలేష్‌కు ప్రశంసలు వెల్లువెత్తాయి.

Similar News

News November 25, 2025

MDK: కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ హెచ్చరిక

image

నర్సాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మంగళవారం నర్సాపూర్ మార్కెట్‌లోని ఫ్యాక్స్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే, ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా కలెక్టర్ పరిశీలించారు.

News November 25, 2025

MDK: కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ హెచ్చరిక

image

నర్సాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మంగళవారం నర్సాపూర్ మార్కెట్‌లోని ఫ్యాక్స్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే, ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా కలెక్టర్ పరిశీలించారు.

News November 25, 2025

పాపన్నపేట: ఇంట్లో నుంచి వెళ్లి యువకుడి సూసైడ్

image

పాపన్నపేట మండలం కొత్తపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. కొత్తపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది ఉమేష్ ముదిరాజ్(23) కుటుంబ సమస్యలతో గొడవ పడి రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. సోదరికి ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పడంతో అతని కోసం గాలించినా ఆచూకీ లభించదు. ఉదయం స్కూల్ వెనకాల చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.