News April 5, 2025
మెదక్: చనిపోయిన జింకకు పోస్టుమార్టం.. అంత్యక్రియలు పూర్తి

రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో ఊరి కుక్కల దాడిలో జింక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. కుక్కల దాడిలోనే జింక మృతి చెందిందని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశామని పేర్కొన్నారు.
Similar News
News November 26, 2025
MDK: ఎన్నికలకు మోగిన నగర.. అంత మీ చేతుల్లోనే

రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆశావాహులు ఇప్పటికే గ్రామాల్లో వరసలు కలుపుకుంటూ.. బంధాలను పెంపొందించుకుంటున్నారు. మూడు విడతల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఆశవాహులు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి మద్దతు దారులను వారు వెంటే ఉంచుకుంటున్నారు. మీ ప్రాంతంలో ఏలా ఉంది. కామెంట్ చేయండి.
News November 26, 2025
మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాలు ఇవే.!

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్లో జిల్లాల్లోని మొదటి విడతలో అనగా డిసెంబర్ 11వ తేదీన అల్లాదుర్గం, రేగోడు, టేక్మాల్, హవేలీ ఘనపూర్, పాపన్నపేట్, పెద్ద శంకరంపేట మండలాల్లోనీ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొంది. దీంతో పల్లెలలో హడావుడి మొదలైంది.
News November 26, 2025
మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాలు ఇవే.!

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్లో జిల్లాల్లోని మొదటి విడతలో అనగా డిసెంబర్ 11వ తేదీన అల్లాదుర్గం, రేగోడు, టేక్మాల్, హవేలీ ఘనపూర్, పాపన్నపేట్, పెద్ద శంకరంపేట మండలాల్లోనీ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొంది. దీంతో పల్లెలలో హడావుడి మొదలైంది.


