News December 25, 2024

మెదక్ చర్చి అభివృద్ధికి నిధులు మంజూరు: సీఎం

image

మెదక్ చర్చి అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి రూ.35 కోట్లు ప్రకటించారు. చర్చి అభివృద్దికి ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులు కేటాయిస్తానని వెల్లడించారు. అంతకు ముందు మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే రోహిత్ పాల్గొన్నారు.

Similar News

News January 25, 2025

మెదక్: జిల్లాలో 88 ఉత్తమ అధికారుల ఎంపిక

image

మెదక్ జిల్లాలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా 88 మంది ఉత్తమ అధికారులు, పోలీస్, ప్రభుత్వ సిబ్బందిని ఎంపిక చేశారు. వీరికి ప్రశంసా పత్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ చేతులమీదుగా అందజేయనున్నారు. ప్రతి ఏటా ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో పనిచేసే వారిని ఎంపిక చేస్తారు.

News January 25, 2025

మెదక్: వైద్యా, విద్య ప్రమాణాలు మెరుగుపడాలి: మంత్రి

image

వైద్యా, విద్య ప్రమాణాలు మెరుగుపడేలా మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. నూతనంగా నియమితులైన రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మెడికల్ కాలేజీలు టీచింగ్ హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.

News January 25, 2025

రేపు మాంసం దుకాణాలు బంద్: కమిషనర్

image

రేపు రామాయంపేట మున్సిపాలిటీలో మాంసం విక్రయాలు జరపొద్దని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. చికెన్‌, మటన్‌, చేపల మార్కెట్లు మూసివేయాలని సూచించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలో మాంసం విక్రయాలు బంద్‌ ఉండనున్నాయి.