News February 26, 2025

మెదక్ చర్చ్ రిటైర్డ్ గురువు రాబిన్ సన్ కన్నుమూత

image

మెదక్ సీఎస్ఐ చర్చ్ రిటైర్డ్ గురువు రాబిన్ సన్ మెదక్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన బుధవారం కన్నుమూశారు. మెదక్ పట్టణంలోని దాయర వీధికి చెందిన రాబిన్సన్ మెదక్ సీఎస్ఐ చర్చిలో 2010 నుంచి 2019 వరకు ప్రిసిబిటరి ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. మెదక్ అధ్యక్ష మండలంలో వైస్ ఛైర్మన్‌గా, మినిస్ట్రియల్ కన్వీనర్‌గా తదితర పదవుల్లో పనిచేశారు.

Similar News

News February 27, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాం. 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేస్తామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని SP కోరారు. పట్టభద్రుల బరిలో 56 మంది టీచర్స్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.

News February 27, 2025

నర్సాపూర్: అప్పులు తీర్చలేక రైతు మృతి

image

నర్సాపూర్ మండలంలోని తుజాల్ పూర్-అర్జు తాండాకు చెందిన హలవత్ గణేష్(42) ఉరేసుకొని మృతిచెందారు. కూతురు పెళ్లికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనతో బాధపడేవాడని, ఇంటికి కొద్ది దూరంలో వ్యవసాయ పొలం వద్ద ఉరేసుకున్నాడు. ఈమేరకు అతడి భార్య హలావత్ సాలమ్మ ఫిర్యాదు చేసిందని నర్సాపూర్ ఎస్సై బి.లింగం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News February 27, 2025

ఏడుపాయలలో తెలంగాణ జానపదుల సమ్మేళనం

image

ఏడుపాయల మహా జాతర అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడుతుంది. నెత్తిన బోనం, శివసత్తుల పూనకాలతో అమ్మవారి ప్రాంగణం వన దుర్గ మాత నామస్మరణతో పోరెత్తుతోంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారి మొక్కలు చెల్లించుకోవడానికి ముందుకు సాగుతున్నారు. బోనాలతో ప్రదర్శనగా వెళ్లి అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు.

error: Content is protected !!