News March 14, 2025

మెదక్: చిరుత పులి దాడిలో లేగ దూడలు మృతి..?

image

మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. రామాయంపేట మండలం దంతేపల్లి శివారులోని నక్కిర్తి స్వామి పొలం వద్ద పశువుల పాకపై అర్ధరాత్రి అడవి జంతువు దాడి చేసి రెండు దూడలను చంపేసింది. అయితే చిరుత దాడితోనే దూడలు మృత్యువాత పడ్డాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అయితే దాడి చేసింది ఏ జంతువు అనేది తెలియాల్సి ఉంది.

Similar News

News March 16, 2025

గజ్వేల్: మొదటి ప్రయత్నంలో గ్రూప్-3లో సత్తా

image

గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి దినేశ్ మెుదటి ప్రయత్నంలోనే గ్రూప్-3లో మెరిశాడు. కాగా దినేశ్ తండ్రి 2020లో అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత మూడు నెలలకే తల్లి రోడ్డు ప్రమాదంలో గాయాపడ్డి కోమాలోకి వెళ్లి మంచానికే పరిమితమైంది. అయినప్పటికీ కష్టపడి దినేశ్ కేవలం ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే వింటూ..అమ్మను చూసుకుంటూ గ్రూప్-3లో 80వ ర్యాంకు సాధించాడు. దీంతో అతన్ని గ్రామస్థులు అభినందిస్తున్నారు.

News March 16, 2025

గ్రూప్-1, 2లో సత్తా చాటిన ఉపాధ్యాయుడికి కలెక్టర్ సన్మానం

image

గ్రూప్-1, 2లో మంచి ర్యాంకులు సాధించి జూనియర్ లెక్చరర్‌గా ఎంపికైన GOVT టీచర్ మనోహర్ రావును కలెక్టర్ రాహుల్ రాజ్ అభినందించి శాలువాతో సత్కరించారు. కుల్చారం మండలం అంసాన్పల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా చేస్తున్న మనోహర్ రావు ఇటీవల ప్రకటించిన గ్రూప్ -2 పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. ఆలాగే గ్రూప్ -1లో మంచి ర్యాంకుతో పాటు జెఎల్ ఉద్యోగానికి ఎంపికై నియామకమాయ్యారు.

News March 16, 2025

ఇందిరమ్మ మోడల్ ఇంటి పనులు పరిశీలించిన కలెక్టర్

image

మెదక్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ రాజ్  పరిశీలించారు. పనుల పురోగతిని అంచనా వేశారు. 45 రోజులలో పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశించారు. ఇందిరమ్మ మోడల్ హౌసింగ్ పథకం ద్వారా పేదలకు మంచి గృహాలను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు.

error: Content is protected !!