News February 12, 2025

మెదక్: చెరువులో పడి 6ఏళ్ల చిన్నారి మృతి

image

మెదక్‌లోని తూప్రాన్ పెద్ద చెరువులో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చాంద్ పాషా, పర్వీన్ కుమార్తె జుబేరియా(6) బుధవారం ఉదయం తల్లితో కలిసి పెద్ద చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి బట్టలు ఉతుకుతుండగా మెట్లపై ఆడుకుంటున్న జుబేరియా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 28, 2026

ఆదిలాబాద్: ఆరుగురు దోపిడీ దొంగలు అరెస్టు

image

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, రిమ్స్ పరిసరాల్లో సెల్‌ఫోన్లు లాక్కొంటున్న ఆరుగురు దోపిడీ దొంగల ముఠాను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 15న జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి సీఐ నాగరాజు ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్నారు. వారిలో ఒకరు బాల నేరస్థుడు ఉన్నాడు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

News February 28, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 28, 2026

ముంబైలో కెనడా ప్రధాని: టార్గెట్ $50 బిలియన్లు

image

కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన తొలి అధికారిక పర్యటనలో భాగంగా ముంబై చేరుకున్నారు. భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీ అని కొనియాడారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్, ఎనర్జీ, AI రంగాల్లో పార్ట్‌నర్‌షిప్‌ను పెంచుకోవడమే ఈ పర్యటన లక్ష్యం. 2030 నాటికి $50 బిలియన్ల బైలేటరల్ ట్రేడ్ లక్ష్యాన్ని చేరుకోవాలని భారత్ భావిస్తోంది. మార్చి 2న ప్రధాన మంత్రి మోదీతో కార్నీ భేటీ కానున్నారు.