News April 15, 2024

మెదక్ జిల్లాలో పెరుగుతన్న కిడ్నీ వ్యాధిగ్రస్థులు..!

image

మెదక్ జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో గతేడాది 73 మంది ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 120కి చేరింది. అయితే ఒక్క చేగుంట మండలంలోనే అత్యధిక బాధితులు ఉన్నారని, 18- 20 మంది మెదక్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్న మండలాల్లో తాగునీటిని ల్యాబ్‌కు పంపి చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి తెలిపారు.

Similar News

News September 30, 2024

ఇందిరాపార్కు ధర్నాలో మెదక్ ఎంపీ రఘునందన్

image

రైతులకు రుణమాఫీ, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో బీజేపీ ప్రజాప్రతినిధుల 24 గంటల రైతు హామీల సాధన దీక్ష చేపట్టారు. ఈ దీశ్రలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ ధర్నాలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News September 30, 2024

MDK: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
మెదక్: 2720 136 1:20
సంగారెడ్డి: 3352 234 1:14
సిద్దిపేట: 3246 157 1:20

News September 30, 2024

సిద్దిపేట: ‘జిల్లాలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి తప్పనిసరి’

image

సిద్దిపేట జిల్లాలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి తప్పనిసరి అని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 15 వరకు జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉంటుందని, ఎలాంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. ముందస్తుగా అనుమతులు తీసుకుని ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలని సూచించారు. డీజేల నిషేధం కొనసాగుతుందని పేర్కొన్నారు.