News August 2, 2024
మెదక్ జిల్లాలో పెరుగుతున్న జ్వరాలు

వర్షాకాలం నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. వారం రోజుల ముసురు వానతో వాతావరణ మార్పులు జరిగి జ్వరాల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని వివిధ గ్రామాలలో రోగులు ఎక్కువ అవుతున్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కొన్ని రోజులుగా రోగుల తాకిడి పెరిగింది. నిత్యం 300లకు పైగా ఓపీ నమోదవుతోంది.
Similar News
News October 23, 2025
RMPT: అజంతా ఎక్స్ ప్రెస్లో సాంకేతిక లోపం

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్లో రెండు గంటలుగా రైలు నిలిచిపోయింది. సికింద్రాబాద్ నుంచి షిరిడి వెళ్తున్న అజంతా ఎక్స్ ప్రెస్ రైలు ఇంజన్ సాంకేతిక లోపం రావడంతో నిలిపివేశారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రైలుకు వేరే ఇంజను బిగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
News October 22, 2025
MDK: గురుకులాల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు

గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకీ దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు ఇన్చార్జి డీసీవో పద్మావతి తెలిపారు. రామాయంపేట, కొల్చారం ఎస్సీ గురుకులాల్లో 2025-26 ఏడాదికి 5 నుంచి 9 తరగతులలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగలవారు ఈ అవకశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 25న డ్రా పద్ధతిలో ఎంపిక ఉంటుందన్నారు.
News October 22, 2025
మెదక్: సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు ఈ సర్వేలో పాల్గొని సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25న ముగుస్తుందన్నారు.