News April 3, 2025
మెదక్ జిల్లాలో ముగిసిన టెన్త్ పరీక్షలు

మెదక్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్ష జరిగింది. రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 10,408 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 10,382 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రొఫెసర్ రాధాకృష్ణ తెలిపారు. 26 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు సంతోషంగా ఇళ్లకు వెళ్లారు.
Similar News
News July 5, 2025
మెదక్: IIITకి 345 మంది ఎంపిక

బాసర IIITకి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 345 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఆయా జిల్లాల విద్యాధికారులు తెలిపారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నుంచి 222 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మెదక్ నుంచి 78, సిద్దిపేట నుంచి 45 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వెల్లడించారు. IIITకి ఎంపికైన విద్యార్థులను ఆయా జిల్లాల విద్యాధికారులు అభినందించారు.
News July 5, 2025
జిల్లాలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం: కలెక్టర్

మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత అధికారులు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సమాజానికి చీడ పురుగులా మారిన మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అధికారులకు సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు.
News July 5, 2025
పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్

సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం, వసతి సౌకర్యాలపై ఆరాతీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.