News January 27, 2025

మెదక్ జిల్లాలో 14,833 రైతులకు రూ.14.06 కోట్లు జమ

image

మెదక్ జిల్లాలో 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 14,833 రైతులకు రూ.14.06 కోట్లు రైతు భరోసా కింద అకౌంట్లలో జమ అయ్యాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి 4 పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముందుగా ఎంపిక చేసిన గ్రామాల రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి. అకౌంట్లలో డబ్బులు జమ కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 19, 2025

సిద్దిపేట: ప్రియుడితో కలిసి భర్త హత్యకు యత్నం

image

ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య యత్నించింది. పోలీసుల వివరాలిలా.. సిద్దిపేటలోని గుండ్లచెరువు కాలనీ వాసికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్యకు అదే కాలనీకి చెందిన శ్రవణ్‌తో వివాహేతర సంబంధం ఉంది. తమకు అడ్డుగా ఉన్న భర్త హత్యకు ప్రియుడితో కలిసి భార్య ప్లాన్ చేసింది. శ్రవణ్ తన స్నేహితులతో కలిసి 2సార్లు దాడి చేయగా భర్త ఇచ్చిన ఫిర్యాదుతో విచారించిన పోలీసులు శ్రవణ్‌ను రిమాండ్‌కు తరలించారు.

News February 19, 2025

నేడు బీఆర్‌ఎస్‌ సమావేశం.. హాజరుకానున్న కేసీఆర్

image

హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బుధవారం సందడి వాతావరణం నెలకొననుంది. మధ్నాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం KCR అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. నగరంతో పాటు అన్ని జిల్లాల ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి తరలివెళ్తున్నారు. కారులన్నీ తెలంగాణ భవన్‌కు క్యూ కట్టాయి. భవిష్యత్తు కార్యాచరణపై HYD వేదికగా కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్‌ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

News February 19, 2025

పదోన్నతి భాద్యతలను పెంచుతుంది: కలెక్టర్

image

పదోన్నతి భాద్యతలను పెంచుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ లోని రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లను కమారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు సీనియర్ అసిస్టెంట్లుగా కేటాయించడం జరిగిందన్నారు. వృత్తినే దైవంగా భావించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని అన్నారు. అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!