News April 12, 2025

మెదక్: డబ్బుల కోసం మహిళ హత్య.. నిందితుడికి రిమాండ్

image

నర్సాపూర్ మం. జైరాంతండాకు చెందిన మెఘావత్ భుజాలీ(52) మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. అయ్యగారిపల్లెకు చెందిన పాత నేరస్థుడు, కెథావత్ గోపాల్ డబ్బుల కోసం ఆమెను హత్య చేసినట్లు మెదక్ SP ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మద్యం తాగించి ఉరేసి హత్య చేసినట్లు చెప్పారు. మార్చి 25న భుజాలీ మిస్సింగ్‌పై కేసు నమోదైంది. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News November 19, 2025

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న PM మోదీ

image

ప్రధాని మోదీ ఈ నెల 21 నుంచి 23 వరకు సౌత్ ఆఫ్రికాలో పర్యటించనున్నారు. 22, 23 తేదీల్లో నిర్వహించనున్న 20వ G-20 సదస్సులో ఆయన పాల్గొంటారని విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘G-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జొహన్నెస్‌బర్గ్‌లో పర్యటించనున్నారు. ఈ సమ్మిట్‌లో ప్రధాని 3 సెషన్లలో ప్రసంగిస్తారు. వివిధ నేతలతోనూ భేటీ అవుతారు. ఇది ఓ గ్లోబల్ సౌత్ దేశంలో వరుసగా నాలుగోసారి జరుగుతున్న G-20 సదస్సు’ అని పేర్కొంది.

News November 19, 2025

కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు: సీఎం

image

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నేటి నుంచి డిసెంబర్ 9 వరకు, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వరకు చీరల పంపిణీ ఉంటుందన్నారు. ఈ వీసీలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, అనిల్ కుమార్ పాల్గొన్నారు.

News November 19, 2025

HYD: పూజిత చనిపోయింది.. పోలీసుల ప్రకటన

image

HYD ఘట్‌కేసర్ పరిధి అవుషాపూర్‌లోని <<18219517>>అనురాగ్ యూనివర్సిటీలో<<>> BSC నర్సింగ్ 3rd ఇయర్ చదువుతున్న పూజిత(22) ఈనెల 6న కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలైన ఆమె పంజాగుట్ట నిమ్స్‌‌లో 13 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి చనిపోయిందని ఘట్‌కేసర్ పోలీసులు ఈరోజు తెలిపారు. కాగా పూజిత స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మలవాడ అని చెప్పారు.