News February 4, 2025

మెదక్: దంపతుల మృతితో పిల్లలు అనాథలు

image

మెదక్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో <<15350285>>దంపతుల మృతి<<>> ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత నెల 11న నార్సింగి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అనారోగ్యంతో చనిపోగా ఆయన భార్య జ్యోతి నిన్న గుండెపోటుతో మృతి చెందింది. దీంతో వీరి కొడుకు, కూతురు తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలారు. కొడుకు మృతిని తట్టుకోలేక శ్రీనివాస్ గౌడ్ తల్లి 2రోజుల క్రితం పక్షవాతంతో ఆస్పత్రిలో చేర్చారు.

Similar News

News January 9, 2026

ఇవాళ నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి ఫ్యామిలీ

image

TG: టాలీవుడ్ నిర్మాత సురేశ్ బాబు, హీరోలు వెంకటేశ్, రానా, అభిరాం ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. స్థలం వివాదం కారణంగా ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్‌ను అక్రమంగా కూల్చి సామగ్రిని దొంగలించారని ఓనర్ నందకుమార్ 2024 JANలో కోర్టును ఆశ్రయించారు. దీంతో వారిపై కేసు నమోదైంది. గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకపోడవంతో వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు అల్టిమేటం జారీ చేసింది.

News January 9, 2026

VJA: మందుబాబులకు చుక్కలు.. 177 మందికి రూ.17.70 లక్షల జరిమానా!

image

విజయవాడ నగరంలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన 177 మందికి న్యాయస్థానం భారీ జరిమానా విధించింది. ఈ నెల 8న పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన వీరిని 7వ అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ RVS శర్మ ఎదుట హాజరుపరిచారు. కేసులను విచారించిన న్యాయమూర్తి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.17.70 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

News January 9, 2026

పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి రేటు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు పెరగగా, వెండి రేట్లు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి రూ.1,38,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగి రూ.1,27,150 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర రూ.4వేలు తగ్గి రూ.2,68,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులున్నాయి.