News February 4, 2025

మెదక్: దంపతుల మృతితో పిల్లలు అనాథలు

image

మెదక్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో <<15350285>>దంపతుల మృతి<<>> ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత నెల 11న నార్సింగి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అనారోగ్యంతో చనిపోగా ఆయన భార్య జ్యోతి నిన్న గుండెపోటుతో మృతి చెందింది. దీంతో వీరి కొడుకు, కూతురు తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలారు. కొడుకు మృతిని తట్టుకోలేక శ్రీనివాస్ గౌడ్ తల్లి 2రోజుల క్రితం పక్షవాతంతో ఆస్పత్రిలో చేర్చారు.

Similar News

News February 19, 2025

KCR ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు: మంత్రి

image

TG: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని <<15513169>>KCR<<>> ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 14 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎలా కనపడుతుందని ప్రశ్నించారు. ‘KCRకు ఎన్నిక‌ల‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌జ‌లు గుర్తుకొస్తారు. ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెడితే ప్ర‌జా తీర్పును గౌర‌వించ‌లేదు. అసెంబ్లీ వైపు రాలేదు’ అని విమర్శించారు.

News February 19, 2025

ప్రాజెక్టులకు కేంద్రం సహాయం కోరిన మంత్రి

image

రాజస్థాన్‌లో జరిగిన జాతీయ నీటిపారుదల మంత్రుల సదస్సులో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్, కార్యదర్శి దేవశీష్ ముఖర్జీతో బుధవారం భేటీ అయ్యారు. కృష్ణా జలాల వివాదం, PRLIS, సీతారామ, సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టుల నిధులు, మూసీ నది పునరుద్ధరణ, NDSA నివేదిక వేగంగా విడుదలపై కేంద్ర సహాయం కోరారు.

News February 19, 2025

రాష్ట్రంలో రానున్న 2, 3 రోజుల్లో చిరుజల్లులు

image

TG: గాలిలో అనిశ్చితి కారణంగా రాబోయే 2, 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. సాధారణం కన్నా ఒకటి, రెండు డిగ్రీలు మాత్రమే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఉక్కపోత ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.

error: Content is protected !!