News February 27, 2026

మెదక్: నిరుద్యోగులకు సువర్ణ అవకాశం

image

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు సెల్‌ఫొన్ రిపేరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల గ్రామీణ యువత దరఖాస్తు చేసుకోవాలని, మార్చి 5 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19 నుంచి 45 ఏళ్లలోపు యువకులు శిక్షణకు అర్హులని, ఆసక్తి గల వారు 94901 03390, 94901 29839 నంబర్‌కు వాట్సప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News April 14, 2026

IPL: త్వరలోనే SRH జట్టులోకి కమిన్స్?

image

SRH కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టులోకి ఎప్పుడు తిరిగొస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇండియా వచ్చి మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లిన ఆయనకు రేపు అక్కడ ఫిట్‌నెస్ టెస్ట్ జరగనున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. ఈ నెల 17న ఆయన ఇండియాకు వస్తారని తెలిపింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆయన జట్టులో చేరే అవకాశం ఉంది. కొన్ని నెలలుగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

News April 14, 2026

రంగారెడ్డిలో 40 దాటింది.. జాగ్రత్త!

image

రంగారెడ్డిలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి దండుమైలారంలో గరిష్ఠంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మాడ్గుల్, ఎలిమినేడు ప్రాంతాల్లో 41.7 డిగ్రీలు, బోడకొండ, రాచులూరు ప్రాంతాల్లో 41.6 డిగ్రీలు నమోదయ్యాయి. యాచారం, మొయినాబాద్, కడ్తాల్ ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిదని నిపుణులు సూచించారు.
SHARE IT

News April 14, 2026

నిర్మల్: ఆడపిల్ల పేరిట రూ.5వేలు, 2 శ్రీగంధం మొక్కలు

image

నిర్మల్‌లోని అనంత్ పేట సర్పంచ్ సునీత ‘మా ఊరి బంగారు తల్లి’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఊరిలో ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆ పాప పేరు మీద బ్యాంకులో రూ. 5వేలు జమ చేయడంతో పాటు 2 శ్రీగంధం మొక్కలు బహుమతిగా అందజేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆడపిల్ల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేందుకు ఈ కార్యక్రమం చెపట్టామని సునీత తెలిపారు.