News February 27, 2026
మెదక్: నిరుద్యోగులకు సువర్ణ అవకాశం

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు సెల్ఫొన్ రిపేరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల గ్రామీణ యువత దరఖాస్తు చేసుకోవాలని, మార్చి 5 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19 నుంచి 45 ఏళ్లలోపు యువకులు శిక్షణకు అర్హులని, ఆసక్తి గల వారు 94901 03390, 94901 29839 నంబర్కు వాట్సప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News April 20, 2026
తూ.గో: బాలికపై అసభ్య ప్రవర్తన.. చితక్కొట్టి వాతలు పెట్టారు..!

పల్నాడు(D) నాదెండ్ల(M) గణపవరంలోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే ఒడిశాకి చెందిన ప్రసాద్దాస్ అనే కార్మికుడు ఓ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. రాజమండ్రికి చెందిన దంపతులు ఇక్కడ మిల్లులో పనిచేస్తున్నారు. వీరి ఇంటి పక్కనే ఉండే ప్రసాద్దాస్ అఘాయిత్యానికి పాల్పడటంతో బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. తోటి కార్మికులతో కలిసి నిందితుడికి దేహశుద్ధి చేసి వాతలు పెట్టారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
News April 20, 2026
CBN నిర్ణయం.. విశాలంగా తిరుమల మాడ వీధులు.!

2000–04 మధ్య చంద్రబాబు శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న ఇళ్లను తొలగించి ఇరుకైన మాడ వీధులను విశాలంగా నిర్మించారు. తిరుమలలో జనాభా తగ్గించి యాత్రికులకు ఎక్కువ స్థలం కేటాయించే ఉద్దేశంతో ఆ పని చేశారు. అక్కడ ఉన్నవారికి తిరుపతి పరిసరాల్లో పునరావాసం కల్పించారు. ప్రస్తుతం 1.15లక్షల మంది ఆలయ మాడవీధుల్లో స్వామిని వీక్షించే ఛాన్స్ ఉంది. దీనిపై మొదట వ్యతిరేకత వచ్చినా ప్రస్తుతం భక్తుల నుంచి CBNకు ప్రశంసలు అందాయి.
News April 20, 2026
ఇంద్రవెల్లి: నేలమట్టం చేసినా వెరవని ఆదివాసీలు

రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఆదివాసీ అమరవీరుల 80 అడుగుల స్థూపం చారిత్రక సాక్ష్యంగా నిలిచింది. 1986లో దుండగులు ఈ స్థూపాన్ని కూల్చివేయగా, ఆదివాసీల ఆందోళనల నేపథ్యంలో 1987లో ప్రభుత్వం పున:నిర్మించింది. దశాబ్దాల పాటు ఆంక్షల నీడలోనే నివాళులర్పించిన గిరిజనులు, రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వేచ్ఛగా వీరులను స్మరించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అమరవీరుల స్మృతి వనంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.


