News February 14, 2025
మెదక్: నేటికి 11 ఏళ్లు..

సరిగ్గా ఇవాళ్టికి 11 ఏళ్లు. దేనికి అనుకుంటున్నారా..? రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్పై పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి. 2014, ఫిబ్రవరి 13న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కరీంనగర్ ఎంపీ హోదాలో ఆయన పోరాటం చేశారు. కాగా, ప్రస్తుతం ఆయన హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
Similar News
News November 28, 2025
NLG: దేశంలోనే అతిపెద్ద భూస్కామ్ ఇదే: మాజీ మంత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీదైన భూములను ఇష్టం వచ్చినట్లుగా, నచ్చినోళ్లకు కట్టబెడుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట MLA జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. దీక్ష దివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలోనే అతిపెద్ద భూ స్కామ్ మన తెలంగాణలో జరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పాలసీల పేరుతో భారీగా స్కామ్లు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
News November 28, 2025
HYD: గడువు ముగిసిన తర్వాతే ‘విలీనం’ !

జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుత గ్రేటర్ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఈ గడువు ముగిసిన తరువాతే సర్కారు జీఓను విడుదల చేయనున్నట్లు సమాచారం. విలీన నిర్ణయాన్ని పాలక మండలి ఆమోదించినా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ఆలస్యం చేయనున్నట్లు తెలిసింది.
News November 28, 2025
HYD: మెగా కార్పోరేషన్గా జీహెచ్ఎంసీ

ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఉన్న మున్సిపాలిటీల విలీనంతో GHMC మెగా కార్పోరేషన్గా అవతరించింది. కాగా కార్పోరేషన్ను 2 లేదా 3గా విభజించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్ని ముక్కలుగా విభజించాలనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది. సంస్థాగత పునర్విభజన, కార్పొరేషన్ బట్టి ఉన్నందున ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తుందని టాక్.


