News October 5, 2024

మెదక్: నేటితో ముగియనున్న డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

image

ఉమ్మడి మెదక్ జిల్లా పరంగా గత నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న డీఎస్సీ 2024 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నేటితో ముగియనుందని జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంకెవరైనా మిగిలిన అభ్యర్థులు ఉంటే ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని కోరారు.

Similar News

News October 5, 2024

రాజగోపురంలో అన్నపూర్ణ దేవిగా ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం

image

దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మూడోరోజు శనివారం ఏడుపాయల వన దుర్గాభవాని మాతను నీలం రంగు వస్త్రాలతో శ్రీ అన్నపూర్ణ దేవి (చంద్రఘంటాదేవి)రూపంలో అలంకరించారు. వేకువజాము నుంచి వేద బ్రాహ్మణులు రావికోటి-శంకర్ శర్మ ఆధ్వర్యంలో రాజ గోపురంలో శ్రీ వన దుర్గభవాని అమ్మవారికి మంజీరా జలాలతో ప్రత్యేక అభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన పూజలు నిర్వహించి నీలం రంగు వస్త్రాలతో అన్నపూర్ణ దేవిగా అలంకరించి మంగళహారతి ఇచ్చారు.

News October 5, 2024

సంగారెడ్డి: పండుగ దృష్ట్యా 542 ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి మెదక్ రీజియన్ పరిధిలో 542 ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు సమాయత్తమైంది. సంగారెడ్డి రీజియన్ పరిధిలోని 8 డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సంగారెడ్డి ఆర్ఎం ప్రభులత తెలిపారు.ఆర్టీసీ చెందిన 334 సర్వీసులు, హైర్ బస్సులు 208 నడుపుతున్నామన్నారు. రద్దీ ఉంటే మరిన్ని నడుపుతామన్నారు.

News October 5, 2024

సంగారెడ్డి: రేపటి నుంచి జూనియర్ కళాశాలలకు సెలవులు

image

ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు జిల్లా 6 నుంచి 13 తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం శనివారం ప్రకటనలో తెలిపారు. దసరా సెలవుల్లో ఏవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 14వ తేదీన తిరిగి కళాశాలలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.