News February 9, 2025
మెదక్: నేడు హెల్ప్ డెస్క్ ద్వారా వినతుల స్వీకరణ: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739017573506_50139766-normal-WIFI.webp)
10న సోమవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే వినతులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంపై కలెక్టర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సంబంధిత శాఖల జిల్లా అధికారులు విధుల్లో నిమగ్నమై ఉన్నందున అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండరని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News February 10, 2025
మెదక్ జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739167464570_50139766-normal-WIFI.webp)
ఫోరం అఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ మెదక్ జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ సోమవారం నిర్వహించారు. టాలెంట్ టెస్ట్ – 2025 క్యూఆర్ కోడ్ ద్వారా ప్రశ్నపత్రం FPST సభ్యులు విడుదల చేశారు. మెదక్ జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ప్రతినిధులు దయానంద రెడ్డి ప్రభు, అశోక్, నాగేందర్ బాబు, దశరథం నూకల శ్రీనివాస్, కృష్ణ, మల్లారెడ్డి, మహిళా ప్రతినిధులు రజిని, నాగలత మమత, రమేష్ చౌదరి తదితరులున్నారు.
News February 10, 2025
MDK: జిల్లాలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739172443469_1243-normal-WIFI.webp)
మెదక్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న గరిష్ఠంగా నర్సాపూర్ మండలంలో 35.5, వెల్దుర్తి 34.1, నిజాంపేట 33.3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News February 10, 2025
MDK: రేపు ముసాయిదా జాబితా విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739164494165_1243-normal-WIFI.webp)
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. MDK జిల్లాలో 21 ZPTCలు, 190 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు.