News June 16, 2024
మెదక్ పట్టణంలో 45 మంది గుర్తింపు: ఐజీ రంగనాథ్

మెదక్ పట్టణంలో నిన్న సాయంత్రం జరిగిన గొడవలకు, అనంతరం జరిగిన ధ్వంసం కేసులో ఇరువర్గాలలో 45 మందిని గుర్తించినట్లు మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ తెలిపారు. పశువులు తరలిస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని సూచించారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పోలీసులు ఊరుకోరని హెచ్చరించారు. సామాన్య ప్రజలు ఎవరిపైన కేసులు పెట్టే ఉద్దేశం లేదన్నారు. రెచ్చగొట్టే వారిని ఉపేక్షించమన్నారు.
Similar News
News December 9, 2025
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికలు మొదటి విడతలో రేగోడ్, హవేలి ఘణపూర్, టేక్మాల్, అల్లాదుర్గ్, పాపన్నపేట్, పెద్దశంకరంపేట్ మండలాల్లో 11న జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని తెలిపారు.
News December 9, 2025
MDK: ఎన్నికల అధికారి కారు, ఆటో ఢీ.. మహిళ మృతి

నార్సింగి మండలం వల్లూరు శివారులోని 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక ఇన్నోవా కారు ఆటోను ఢీ కొట్టడంతో జాతీయ రహదారిపై రోడ్డు పనులు చేస్తున్న ఓ మహిళకు తాకింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆటోను ఢీ కొట్టిన ఇన్నోవా కారు నిర్మల్ ఎన్నికల అబ్జర్వర్దిగా తెలుస్తుంది.
News December 9, 2025
మెదక్: కోడ్ ఎఫెక్ట్.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కలెక్టర్ దూరం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఈరోజు ఆవిష్కరించారు. ముందుగా కలెక్టర్ల చేతుల మీదుగా విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. కానీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉన్నందున మెదక్లో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎస్పీలు దూరంగా ఉన్నారు. దీంతో డీఆర్ఓ చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి కార్యక్రమం ముగించారు.


