News March 18, 2025

మెదక్: పరువు తీశాడని చంపేశారు

image

ఏడుపాయలలో జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్టు చేశారు. CI రాజశేఖర్ రెడ్డి వివరాలిలా.. రామతీర్థం వాసి నవీన్ కుమార్, సంగారెడ్డికి చెందిన వినోద్ రెడ్డి, రమాణాచారి, రాములుపై FEB 17న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో నవీన్ రిక్వెస్ట్ చేస్తుండగా, వినోద్ దురుసుగా మాట్లాడటంతో ఇలా జరిగిందని, దీంతో పరువు పోయిందని వారు భావించారు. ఈనెల 8న మద్యం మత్తులో ఉన్న వినోద్‌ను ముగ్గురు కలిసి హత్య చేశారు.

Similar News

News March 18, 2025

మెదక్: టెన్త్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి

image

మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని వయోజన విద్యా శాఖలో డైరెక్టర్‌గా పని చేస్తున్న ఉషారాణిని నియమిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు జిల్లాలోని పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు.

News March 18, 2025

మెదక్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

image

మెదక్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. హవేళిఘనపూర్, మెదక్,  పాపన్నపేటలో 40.3డిగ్రీలు, నర్సాపూర్, టేక్మాల్ 40‌.2, వెల్దుర్తి 39.9, కుల్చారం 39.8, నిజాంపేట్ 39.7, చిన్నశంకరంపేట 39.6, శివ్వంపేట 39.1, చిలపిచెడ్, చేగుంట 39.0, మాసాయిపేట 38.8, రేగోడ్ 38.7, కౌడిపల్లి 38.4, పెద్దశంకరంపేట 38.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 18, 2025

మెదక్: ఎండిపోతున్న వరి.. రైతుల ఆందోళన

image

మెదక్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో జిల్లాలో చాలాచోట్ల వరిపంటలు ఎండిపోతున్నాయి. నీరందక చేగుంట మండలం పొలంపల్లిలో వరి ఎండిపోతుంది. దీనికి తోడు ఎండలు సైతం ముదరడంతో వరి పంటపై తీవ్ర ప్రభావం చూపుతుందని గ్రామంలో దాదాపు 20 ఎకరాల వరి బీటలు బారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

error: Content is protected !!