News March 29, 2024
మెదక్ పార్లమెంట్లో యువతే కీలకం

మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో యువత ఓట్లే ఆయా పార్టీలకు కీలకంగా మారనున్నాయి. మెదక్ లోకసభ స్థానంలో మొత్తం 18,19,397 మంది ఓటర్లు ఉండగా, అందులో 39 ఏళ్ల లోపు వారే 9, 52,583 మంది ఉన్నారు. ఈ దఫా ఎన్నికల్లో 18-19 ఏళ్ల వయస్సున్న యువ ఓటర్లు 53,458 మంది కొత్తగా ఓటు హక్కును పొందారు. ఏప్రిల్ 15 వరకు నూతన ఓటర్లు నమోదు చేసుకునే వెసులుబాటును ఎలక్షన్ కమీషన్ ఇవ్వడంతో యువ ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Similar News
News January 1, 2026
మెదక్: భార్యను హత్య చేసిన భర్త.. జీవిత ఖైదు

తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో భార్య నాగరాణిను హత్య చేసిన భర్త ఊషణగళ్ల చంద్రం అనే వ్యక్తికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 2021 ఆగస్టు 27న దంపతుల మధ్య గొడవ జరగగా భార్యను భర్త కొట్టి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో జైలు శిక్ష విధించినట్లు వివరించారు. శిక్ష పడేందుకు కృషిచేసిన సిబ్బందిని అభినందించారు.
News January 1, 2026
మెదక్: ముగ్గురు పోలీస్ అధికారులకు సేవ పథకాలు

మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సేవ పథకాలను ప్రకటించింది. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్కు ఉత్తమ సేవ పథకం, ఎస్ఐ విఠల్కు సేవ పథకం, మెదక్ టౌన్ ఏఎస్ఐ రుక్సానా బేగంకు సేవ పథకం ప్రకటించారు. ఎంపికైన అధికారులను ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అభినందించారు. భవిష్యత్లో కూడా ఇదే విధంగా ప్రజాసేవలో అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
News January 1, 2026
మెదక్: నేటి నుంచి పోలీస్ యాక్ట్: ఎస్పీ

మెదక్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జనవరి 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు 30, 30 ఏ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా అనుమతి లేనిది ఎలాంటి రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


