News March 8, 2025

మెదక్ పీఆర్ సర్కిల్ ఎస్ఈగా జగదీశ్వర్ బాధ్యతలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా పంచాయతీ రాజ్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)గా బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి ఈఈగా ఉన్న జగదీశ్వర్‌కు మెదక్ ఇన్చార్జ్ ఎస్ఈగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. తాజాగా ప్రభుత్వం ప్రమోషన్ ఇస్తూ మెదక్ జిల్లా పంచాయతీ రాజ్ సర్కిల్ ఎస్ఈగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. మెదక్ ఈఈ నర్సింలు, డిఈ పాండురంగారెడ్డితో పాటు, ఇతర డిఈ, ఏఈలు పుష్పగుచ్చం అందజేశారు.

Similar News

News October 31, 2025

మెదక్: ‘మహిళల, బాలికల భద్రతకే షీ టీమ్స్’

image

మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. వేధింపులకు గురైనవారు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెలలో జిల్లాలో 17 ఎఫ్ఐఆర్‌లు, 13 ఈ-పిటి కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే 69 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 88 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.

News October 31, 2025

తూప్రాన్: మళ్లీ కనిపించిన పులి

image

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పులి మళ్లీ శుక్రవారం కనిపించింది. మల్కాపూర్ – దాతర్ పల్లి మార్గమధ్యలో గుండుపై సేద తీరుతూ శుక్రవారం ఉదయం కనిపించింది. బుధవారం కనిపించిన ప్రదేశంలోనే మళ్లీ పులి కనిపించడంతో అక్కడే మకాం వేసినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

News October 31, 2025

నర్సాపూర్ అర్బన్ పార్కులో రేపు కాటేజీలు ప్రారంభం

image

మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని రూ. 20 కోట్లతో ఏర్పాటు చేసిన నర్సాపూర్ అర్బన్ పార్కులో నిర్మించిన కాటేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ కాటేజీలను శనివారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గొంటారు. ఈ ప్రారంభంతో సందర్శకుల రద్దీ, రాత్రి బస చేసే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.