News March 30, 2024

‘మెదక్ ప్రజల ఆశ, శ్వాసగా పనిచేస్తా.. గెలిపించండి’

image

మెదక్ ప్రజల ఆశ, శ్వాసగా పనిచేస్తామని రఘునందన్ రావు తెలిపారు. ఇందిరా గాంధీ హామీ ఇచ్చి నాలుగు దశాబ్దాలుగా కానీ పనులు ఐదేండ్లలో మోదీ నేతృత్వంలో చేసి చూపించామన్నారు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపిలు లేకున్నా మెదక్ రైలు, మెదక్ మీదుగా జాతీయ రహదారులు, అనేక పనులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెదక్ ఆత్మగౌరవాన్ని కాపాడేలా పనిచేస్తా అన్నారు. మెదక్ ఎన్నిక ఏకపక్షమని రఘునందన్ రావు పేర్కొన్నారు.

Similar News

News November 16, 2025

చేగుంట: ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడిగా బంగారయ్య

image

చేగుంట మండలం చందాయిపేట హైస్కూల్ ఉపాధ్యాయులు గంగిశెట్టి బంగారయ్య ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. బంగారయ్యకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాండు, నర్సింలు, చేగుంట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెంటగౌడ్, మనోహర్ రావు, కార్యవర్గ సభ్యులు సుధాకర్, సిద్ధిరాములు సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు వాణి శుభాకాంక్షలు తెలిపారు

News November 16, 2025

మెదక్: 1.19 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

image

జిల్లాలో ఇప్పటివరకు 27,993 మంది రైతుల నుంచి 1,19,461.560 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రూ.102.84 కోట్ల చెల్లింపులు జరిగాయని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు వేగవంతం చేయాలని ఆదేశించారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోళ్ల తీరును తీరును పరిశీలించారు.

News November 16, 2025

MDK: పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైద్యాధికారులు పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం ఆయన శంకరంపేట (ఆర్) మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పుస్తకాలు, మందుల స్టాక్ బోర్డులను నిశితంగా పరిశీలించారు. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించాలని అధికారులకు ఆదేశించారు.