News October 7, 2024

మెదక్: ‘ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి’

image

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలువురు దరఖాస్తు దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈకార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, దరఖాస్తు దారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 10, 2025

MDK: బాండ్ పేపర్ హామీలకు ఓట్లు వచ్చేనా?

image

ఈసారి ఉమ్మడి మెదక్ జిల్లాలో జీపీ ఎన్నికల్లో బాండ్ పేపర్ హామీల ట్రెండ్ పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల హామీ బాండ్ ఇచ్చిన మాదిరిగానే జీపీ ఎన్నికల్లో అనేకచోట్ల బాండ్ పై అనేక హామీలతో కూడిన వాగ్దానాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందోనని అభ్యర్థులు, ప్రజలు చూస్తున్నారు. శాసనసభ, లోక్‌సభ మాదిరిగా జీపీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు గ్రామ ఓటర్లను ఆకట్టుకునేలా హామీలు గుప్పిస్తున్నారు.

News December 10, 2025

మెదక్: 3వ విడతలో 20 జీపీలు ఏకగ్రీవం

image

మెదక్ జిల్లాలో మూడవ విడతలో జరిగే ఎన్నికల్లో 20 గ్రామ పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. 183 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న ఉపసంహరణల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటించారు. మండలాల వారీగా చిలప్ చెడ్-2, కౌడిపల్లి-7, కుల్చారం-3, నర్సాపూర్-2, శివంపేట- 3, వెల్దుర్తి-3 గ్రామపంచాయతీలలో సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

News December 10, 2025

MDK: మెదటి విడతకు 1,292 పోలింగ్ కేంద్రాలు

image

మొదటి విడత ఎన్నికల కోసం 6 మండలాల్లో 1,292 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎన్నికలకు 155 ROలు, 1,421 POలు, 1,529 OPOలను నియమించారు. అల్లాదురం(M)లో మొత్తం 23,555 ఓటర్లు ఉండగా, పురుషులు 11,296, మహిళలు 12,259 మంది, హవేలీఘనపూర్(M)లో మొత్తం 29,863, పురుషులు 13,987, మహిళలు 15,876, పాపన్నపేట(M)లో మొత్తం 42,403, 19,986, మహిళలు 22,416, ఇతరులు ఒక్కరు ఉన్నారు.