News October 23, 2024
మెదక్: ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి: హరీశ్రావు

మెదక్ జిల్లా హవేలిఘనపూర్ గురుకులానికి చెందిన నలుగురు విద్యార్థినులు విద్యుదాఘాతానికి గురవ్వడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు. విద్యార్థినులు కరెంట్ షాక్ తగిలి గాయపడటం దురదృష్టకరమని అన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని.. ప్రభుత్వ పట్టింపు లేనితనం పిల్లల ప్రాణాల మీదకు తీసుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News January 7, 2026
మెదక్: ఉత్తమ సేవా పథకానికి ఎంపికైన డీఎస్పీ

విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు ఉత్తమ సేవా పథకానికి ఎంపికైన మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ను TUWJU నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహ్మద్ రియాజుద్దీన్, జిల్లా అధ్యక్షుడు ఇంతియాజుద్దీన్, సబ్దర్ అలీ, యూసుఫ్ అలీలు ఆయనకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ సేవలను నాయకులు కొనియాడారు.
News January 6, 2026
మెదక్: పొరపాటు లేకుండా తుది ఓటరు జాబితా రూపకల్పన: కలెక్టర్

పొరపాటు లేకుండా తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో పురపాలక తుది ఓటరు జాబితా రూపకల్పనపై అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన పొలిటికల్ పార్టీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
News January 6, 2026
మెదక్ జిల్లా పరిధిలో చైనా మాంజా పూర్తిగా నిషేధం: ఎస్పీ

మెదక్ జిల్లా పరిధిలో చైనా మాంజాను పూర్తిగా నిషేధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా దృష్టి పెట్టామన్నారు.


