News March 20, 2025
మెదక్: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

మెదక్ జిల్లాలో ఈనెల 5 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో పాటు త్వరలోనే ఫలితాలను విడుదల చేసేందుకు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని చెప్పారు.
Similar News
News March 28, 2025
మెదక్: ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య !

మెదక్ పట్టణం గాంధీ నగర్లో ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహమ్మద్ ఫారుక్(32) తన రేకుల ఇంటిలోనే ఉరివేసుకున్నట్లు కుటుంబీకులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించి విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తోన్నారు.
News March 28, 2025
మెదక్: ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి వీడ్కోలు

ఆరు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన మెదక్ జిల్లాకు చెందిన శేరి సుభాష్ రెడ్డి గురువారం పదవి వీడ్కోలు పొందారు. హవేలిఘనపూర్ మండలం కూచన్పల్లికి చెందిన శేరి సుభాష్ రెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి గులాబీ పార్టీలో పనిచేశారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా పేరొందిన సుభాష్ రెడ్డికి ఆరు సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నేటితో పదవి ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి, మండలి ఛైర్మన్ సత్కరించారు.
News March 27, 2025
మెదక్: ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్ మండలంలో గురువారం జరిగింది. స్థానికుల వివరాలు.. బిహార్లోని బాక్సర్ జిల్లా, సిమారికి చెందిన కమలేష్ కుటుంబంతో కలిసి కాళ్లకల్లో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య మమత ఇద్దరు పిల్లలు కలరు. వెల్డింగ్ వర్క్ చేసుకుంటా జీవనం కొనసాగించేవాడు. ఆర్థిక ఇబ్బందులతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.