News April 7, 2025

మెదక్: ప్రేమ వివాహం వద్దనందుకు యువతి ఆత్మహత్య

image

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడం లేదని యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. పోలీసుల వివరాలు.. కామారెడ్డి జిల్లా భగీరథపల్లికి చెందిన వరలక్ష్మి(18) కొద్దిరోజులుగా చేగుంట(M) బోనాలలోని సోదరితో ఉంటుంది. అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వరలక్ష్మి ప్రేమలో పడింది. ఈ విషయంలో వరుస కాదని తల్లిదండ్రులు మందలించడంతో 4న విషం తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Similar News

News November 20, 2025

NLG: ఎఫ్‌సీఐ డివిజనల్ కార్యాలయం ప్రారంభం

image

నల్గొండ జిల్లాలో నూతనంగా నిర్మించిన ఎఫ్‌సీఐ డివిజనల్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, FCI ED వనిత శర్మ, MLC శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ధాన్య నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి, పంపిణీని మెరుగుపరచడానికి ఈ కార్యాలయం దోహదపడుతుందని మంత్రులు పేర్కొన్నారు.

News November 20, 2025

నర్వ: యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతిపై సమీక్షించిన నీతి ఆయోగ్ సీఈఓ

image

యాస్పిరేషన్ బ్లాక్ పరిధిలోని నర్వ మండలంలో సూచించబడిన వివిధ విభాగాల ప్రగతి పై గురువారం నీతి అయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. నీతి అయోగ్ సీఈఓ అధ్యక్షతన జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి రోహిత్ కుమార్, నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News November 20, 2025

HYD: సౌదీలో మృతదేహాలకు రేపు అంత్యక్రియలు: అజహరుద్దీన్

image

సౌదీలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి రేపు అంత్యక్రియలు చేయనున్నట్లు మైనారిటీ శాఖ మంత్రి అజహరుద్దీన్ తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ మంత్రి అజహరుద్దీన్, ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ సౌదీ అధికారులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా మృతుల కుటుంబసభ్యులు సైతం సౌదీకి చేరుకున్నారు.