News April 12, 2024

మెదక్: ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’

image

కాంగ్రెస్‌ పాలనతో అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించుకోవాలని, ఫిర్‌ ఏక్‌బార్‌ మోదీ సర్కార్‌ నినాదాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ఈటల ఉద్ఘాటించారు. మెదక్‌ చిల్డ్రన్‌ పార్కులో పోలింగ్‌ బూత్‌ కేంద్రాల అధ్యక్షులు సమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రసంగించారు.

Similar News

News November 25, 2025

మెదక్: 49 వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు

image

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. ఇప్పటివరకు 49,027 మంది రైతుల నుండి 2,00,334 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ. 323.04 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. అలాగే, 5,008 మంది సన్నధాన్యం రైతులకు రూ. 11.56 కోట్ల బోనస్ చెల్లింపులు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.

News November 25, 2025

మెదక్‌: కార్మికులు బీమా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

మెదక్ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో కార్మిక భీమా పెంపు పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికుల బీమా పెంపు సదస్సులు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 8 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు సహజ మరణం సంభవిస్తే ఒక లక్ష నుంచి రూ.2లక్షల వరకు పెంచినట్లు తెలిపారు.

News November 25, 2025

మెదక్: మహిళలకు గుడ్ న్యూస్

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,37,438 మంది స్వయం సహాయక బృందాలలో ఆర్హులైన మహిళలకు వడ్డీ లేని రుణాలకింద రూ.8కోట్ల 80లక్షల వడ్డీని బ్యాంకు లీంకేజీపై మహిళల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వడ్డీ లేని రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.