News January 5, 2025
మెదక్: బాలికపై సామూహిక అత్యాచారం
మెదక్ జిల్లా మసాయిపేట మండలంలోని ఓ గిరిజన తండాలో దారుణం జరిగింది. ఎస్ఐ వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో బాలిక అన్నయ్య, బాబాయ్ వారిని తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అదునుగా తీసుకున్న ఇద్దరు యువకులు ఇంట్లో ఒంటరిగా ఉన్న 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దిరపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News January 17, 2025
మెదక్: DSC-2008 అభ్యర్థుల కల సాకారమయ్యేనా..?
16 ఏళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీ- 2008 అభ్యర్థుల కల సాకారం అవుతుందా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది. DSC-2008 అభ్యర్థుల పోస్టింగులకు సంబంధించిన దస్త్రాలపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం సంతకం పెట్టి ఆమోదం తెలపడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. కాగా, 2024 సెప్టెంబర్ 25, 26 తేదీల్లో సంగారెడ్డిలో ఉమ్మడి జిల్లా అభ్యర్థులు 280 మంది వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్లో పాల్గొన్నారు.
News January 17, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం
సంక్రాంతి సెలవుల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 18 నుంచి పునః ప్రారంభం అవుతున్నాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పాఠశాలలకు రెగ్యులర్గా రావాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు యథావిధిగా నిర్వహించాలని చెప్పారు.
News January 17, 2025
సంగారెడ్డి: అక్కాచెల్లెళ్ల మృతి.. కేసు నమోదు
అదృశ్యం అయిన బాలిక బావిలో శవమై దొరికింది. SI వివరాల ప్రకారం.. సంగారెడ్డి(D) రాయికోడ్ (M) సంగాపూర్కి చెందిన సతీశ్-అనితకు ఇద్దరు కుమార్తెలు. వీరు విడిపోగా.. పిల్లలు తండ్రి వద్దే ఉంటున్నారు. ఇటీవల చిన్నకూతురు హరిత(6) మృతిచెందింది. ఈక్రమంలో ఈ నెల 9న వైష్ణవి ఇంటి నుంచి వెళ్లిపోయి.. గురువారం గ్రామ శివారులోని బావిలో శవమై తేలింది. అక్కాచెల్లెళ్ల మృతిపై అనుమానం ఉన్నట్లు నాన్నమ్మ ఫిర్యాదు చేసింది.