News June 19, 2024

మెదక్: మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

image

నర్సాపూర్ నియోజకవర్గంలో రేపు జరిగే మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా బుధవారం ఉదయం 11 గంటల నుంచి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.

Similar News

News November 22, 2025

మెదక్: పంచాయతీ ఎన్నికలపై జీవో జారీ.. అధికారుల చర్యలు

image

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.పంచాయతీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా కొత్త ప్రతిపాదనలను కమిషన్ సమర్పించింది. ఈ జీవో ఆధారంగా నేడు, రేపు వార్డుల రిజర్వేషన్లు, ఎంపీడీవో, సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే దిశగా మెదక్ అధికారులు చర్యలు చేపట్టారు.

News November 22, 2025

యాక్సిడెంట్.. మెదక్ యువకుడు మృతి

image

HYD శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మెదక్ పట్టణానికి చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. పట్టణానికి చెందిన కాముని శ్రీనివాస్ కుమారుడు కాముని భారత్ (23) ఈరోజు ఉదయం రింగ్ రోడ్డుపై కారులో వస్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మరణించాడు. కారులో ప్రయాణిస్తున్న మెదక్ కరూర్ వైశ్య బ్యాంకు మేనేజర్ భార్యకు తీవ్ర గాయాలవగా అసుపత్రికి తరలించారు. పట్టణంలో విషాదం అలుముకుంది.

News November 21, 2025

తూప్రాన్: విద్యార్థులు ఇష్టంతో చదవాలి: డీఈవో

image

పదవ తరగతి విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంతో చదివి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాధికారి విజయ పేర్కొన్నారు. శుక్రవారం తూప్రాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కాంప్లెక్స్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఎస్ఎస్సీ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేకతలను పరిశీలించారు. విద్యార్థులకు అవసరాలు ఉంటే సహకరిస్తానని, పరీక్షకు అందరూ హాజరై ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.