News May 11, 2024

మెదక్: మరికొన్ని గంటల్లో మూగబోనున్న మైకులు

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఇవాళ సా.6 గం.కు మైకులు మూగబోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. గత 57 రోజుల నుండి ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ప్రధాన పార్టీలైన BRS, కాంగ్రెస్, బిజెపి పార్టీల ముఖ్య నేతలు మెదక్ గడ్డపై తమ పార్టీ జెండా ఎగర వెయ్యాలని ప్రచారం నిర్వహించారు. మరోవైపు సాయంత్రం ప్రచారం ముగియనుండడంతో ప్రలోభాల పర్వం మొదలయ్యే అవకాశం ఉంది.

Similar News

News December 2, 2025

మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 2, 2025

మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 2, 2025

MDK: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిషేధం: ఎస్పీ

image

శాంతిభద్రతల పరిరక్షణకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలు ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు, రాస్తారోకోలు నిషేధమని, చట్టవ్యతిరేక, అశాంతి సృష్టించే చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పోలీసుల చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.