News February 8, 2025

మెదక్: మొదలైన భానుడి భగభగలు..

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరుణుడి ప్రతాపం ప్రారంభమైంది. ఎండలు అప్పుడే దంచి కొడుతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో చలి తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజలు తమ ఇంట్లోని కూలర్లు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలు, ఫ్యాన్లు మొదలైన విద్యుత్ ఉపకరణాలను బయటకు తీసి రీపేర్లు చేయించుకుంటున్నారు. మరోవైపు ఎండలు ముదురుతుండడంతో రోడ్లపై జ్యూస్ షాపులు వెలుస్తున్నాయి.

Similar News

News February 6, 2026

మెదక్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

అంత్యక్రియలకు వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందాడు. మేడ్చల్ జిల్లా కొనాయిపల్లికి చెందిన గుంటి నవీన్ కూచారంలో అంత్యక్రియలకు హాజరై బైక్‌పై వెళ్తున్నాడు. కాళ్లకల్ మైకో కంపెనీ వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 6, 2026

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు: ఎస్పీ

image

మద్యం మత్తులో జరిగిన గొడవలో వ్యక్తిని హత్య చేసిన నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. గడిపేద్దపూర్‌కు చెందిన మహేష్.. యాదయ్యపై కర్రతో దాడి చేసి చంపాడు. దీనిపై అలాదుర్గం పోలీసులు దర్యాప్తు చేసి సాక్ష్యాలను ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News February 5, 2026

మున్సిపల్ ఎన్నికలు.. 2వ విడత రాండమైజేషన్

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది 2వ విడత రాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ రాహుల్ రాజ్ నిర్వహించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికల విధుల కోసం సిబ్బందిని ఎంపిక చేశారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.