News October 30, 2024

మెదక్: మోత మోగుతున్న ‘టపాసుల’ ధరలు !

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో టపాసుల ధరలు మోత మోగుతున్నాయి. షాపుల అనుమతి, ఇతరత్రాకు సంబంధించి మామూళ్లు చెల్లించిన వ్యాపారులు ఆ భారమంతా వినియోగదారులపై మోపుతున్నారు. భారీగా పెరిగిన టపాసుల ధరలతో ఈ ఏడాది సాధారణ, మధ్యతరగతి వారు టపాసులు కొనాలంటేనే జంకుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కాకర పుల్ల నుంచి 1000 వాలా వరకు టపాసుల ధరలు 30% పెరిగాయి. వ్యాపారులు వారి నోటికి ఎంత వస్తే అంతే చెప్పి ధరలు పిండుకుంటున్నారు.

Similar News

News October 26, 2025

రామాయంపేట: GREAT.. 56వ సారి రక్తదానం

image

రామాయంపేట పట్టణానికి చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సొసైటీ ఛైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి 56వ సారి రక్తదానం చేశారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 56వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు చేతుల మీదుగా రక్తదాన పత్రాన్ని అందుకున్నారు. రాజశేఖర్ రెడ్డి సేవలను ఎస్పీ అభినందించారు.

News October 26, 2025

అమర వీరుల త్యాగాలు వృథా కావు: ఎస్పీ శ్రీనివాసరావు

image

పోలీస్ అమర వీరుల త్యాగాలు ఎప్పటికీ వృథా కావని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, సేవా కార్యక్రమాల్లో కూడా ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News October 25, 2025

‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పకడ్బందీగా పూర్తి చేయాలి’

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివిజన్ పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని దశలవారీగా, లోపాలకు తావు లేకుండా పూర్తి చేస్తామని వివరించారు.