News March 15, 2025
మెదక్: యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య

యువకుడు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ పట్టణం బారా ఇమాంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్కు చెందిన అరవింద్ (26) ఫతేనగర్లో ఉంటూ ఆర్టీసీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 1, 2025
‘భూధార్’ కార్డుల కోసం ‘mభూధార్’ యాప్

TG: ఆధార్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి ప్రత్యేక ID నంబర్తో కూడిన ‘భూధార్’ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. భూముల యాజమాన్య హక్కుల ఆధారంగా రైతులకు అందించనుంది. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటికే ‘mభూధార్’ ప్రత్యేక యాప్ను ప్రారంభించింది. స్థానిక ఎన్నికల అనంతరం 2026 JAN నుంచి ఇవి పంపిణీ అవుతాయి. వీటితో భూ వివాదాల తగ్గుదల, సులభ లావాదేవీలు, డిజిటలైజేషన్, పథకాల సక్రమ అమలుకు అవకాశం ఉంటుంది.
News December 1, 2025
విపత్తుల సమయంలో ముందస్తు జాగ్రత్తలపై శిక్షణ: కలెక్టర్

విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్ది అన్నారు. సోమవారం పార్వతీపురంలోని కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపక సేవల శాఖ పరికరాలను ఆయన పరిశీలించారు. విపత్తుల కోసం గ్రామస్థాయిలో వాలంటీర్లను ఏర్పాటుచేసుకొని వారికి శిక్షణ ఇవ్వాలని సూచించారు.
News December 1, 2025
VJA: దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ సీఎం సోదరుడు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బడేటి ధర్మారావు, టీడీపీ రాష్ట్ర నాయకుడు రాంప్రసాద్తో పాటు పలువురు పాల్గొన్నారు.


