News March 12, 2025

మెదక్: రూ.12 వేల లంచం కోసం ఆశపడి.. ఏసీబీకి చిక్కి

image

రూ.12 వేల లంచం కోసం ఆశపడి బంగారు భవిష్యత్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీకి పట్టుబడ్డాడు. మెదక్ పురపాలక సంఘంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నకిరేకంటి జానయ్య గెల్లి శైలజ తన సోదరుడు శ్రీనివాస్‌కు చెందిన 605 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఓపెన్ ప్లాట్‌పై దరఖాస్తుపై విచారణ, మ్యూటేషన్ కోసం రూ.20 వేల లంచం డిమాండ్ చేయగా.. రూ.12 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు.

Similar News

News February 12, 2026

మెదక్: ఓటింగ్‌లో మహిళా చైతన్యం భేష్.. !

image

మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు మరోసారి ఓటింగ్‌లో సత్తా చాటారు. 4 మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా 80.76 శాతం ఓటింగ్ నమోదు చేసి చైతన్యాన్ని ప్రదర్శించారు. మొత్తం 44,591 మంది మహిళా ఓటర్లలో 36,015 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని 4 ఛైర్మన్ స్థానాలు మహిళలకే రిజర్వ్ కావడంతో మహిళా ఓటర్ల ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో రేపటి ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News February 12, 2026

మెదక్ జిల్లాలో 4 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

image

మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు వేర్వేరుగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్‌లో గోల్డ్ బంగ్లా వెస్లీ కళాశాల, నర్సాపూర్‌లో BVRIT, తూప్రాన్‌లో నోబుల్ ఫార్మా కళాశాల, రామాయంపేటలో ఎంపీడీవో కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. రేపు ఉదయం నుండే ఈ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.

News February 12, 2026

MDK: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి నేడు OD

image

నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు ఓడీ సౌకర్యం కల్పిస్తున్నట్లు MDK జిల్లా విద్యాధికారి విజయ తెలిపారు. విధుల్లో ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, కౌంటింగ్ ట్రైనింగ్ ఉన్న సిబ్బంది మాత్రం తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాలని సూచించారు. పాఠశాలల నిర్వహణకు ఆటంకం కలగకుండా హెచ్‌ఎంలు, ఎంఈఓలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.