News March 21, 2025

మెదక్: రూ.1,70,42,046 ఆస్తిపన్ను చెల్లించిన జిల్లా జడ్జి

image

మెదక్ కోర్టు భవనాల ఆస్తి పన్ను బకాయి మొత్తాన్ని జిల్లా జడ్జి లక్ష్మీ శారద చెల్లించారు. జిల్లా జడ్జికి మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత కొంతకాలంగా కోర్టు భవనాల ఆస్తిపన్ను బకాయి ఉండడం వల్ల ఈ విషయాన్ని జిల్లా జడ్జి లక్ష్మీ శారద దృష్టికి మున్సిపల్ అధికారులు తీసుకెళ్లారు. తక్షణమే స్పందించి రూ.1,70,42,046 ను గురువారం చెల్లించారు.

Similar News

News February 25, 2026

మెదక్: తొలిరోజు 99.42 శాతం

image

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు 99.42 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు డిఐఈఓ మాధవి తెలిపారు. మొత్తం 6,660 మంది విద్యార్థులకు గాను 6,622 మంది హాజరయ్యారని, కేవలం 38 మంది మాత్రమే గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 14 మంది, ఒకేషనల్ విభాగంలో 24 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని వివరించారు.

News February 25, 2026

మెదక్: పరీక్షా కేంద్రాల సందర్శించిన ఎస్పీ

image

నేడు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశామని తెలిపారు.

News February 25, 2026

మెదక్ పోలీసులకు 6 Medals

image

తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన 4వ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మెదక్ పోలీసులు 6 రజత పతకాలు సాధించారు. టెన్నిస్‌లో రాథోడ్ రమేశ్ సింగిల్స్, డబుల్స్, గ్రూప్ ఈవెంట్స్‌లో హ్యాట్రిక్ రజతాలు గెలిచారు. ఎస్పీ డీవీ శ్రీనివాస రావు విజేతలను సత్కరించి అభినందించారు. కబడ్డీలో భవాని, వీణ, సుష్మ జట్టును మూడో స్థానానికి తీసుకువచ్చారు.