News July 8, 2024

మెదక్: రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన SI

image

మెదక్ జిల్లా హావేలిఘనపూర్ SI ఆనంద్ గౌడ్ లంచం తీసుకుంటూ చిక్కారు. సీజ్ చేసిన ఇసుక టిప్పర్ వదిలేందుకు రూ.50వేలు డిమాండ్ చేసినట్ల తెలిసింది. ఈ క్రమంలో రూ.20 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అనిశా అధికారులు పోలీస్ స్టేషన్‌లో సోదాలు చేస్తున్నారు. విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇటీవల మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడగా ఎస్ఐ, మరో కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురయ్యారు.

Similar News

News January 3, 2026

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో పరేడ్

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఈరోజు పరేడ్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరేడ్‌కు హాజరై గౌరవ వందనం స్వీకరించి పరిశీలించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం అవసరమని సిబ్బందికి సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.

News January 2, 2026

నర్సాపూర్ బీవీఆర్ఐటీలో టెట్ పరీక్షా కేంద్రం

image

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-TET)పరీక్షను జిల్లాలో నర్సాపూర్ BVRITలో ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయ తెలిపారు. ఈనెల 4న ఉ.9 నుంచి 11.30 గంటల వరకు, మ.2 నుంచి సా.4.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. మొత్తం 400 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. హాల్ టికెట్లను https://tgtet.aptonline.in/tgtet వెబ్‌సైట్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.

News January 2, 2026

మెదక్: ‘విద్యావంతులే బలవుతున్నారు’

image

మెదక్‌లో సైబర్ వారియర్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాలకు బలవుతున్నారని, అవగాహన లోపం, అత్యాశే కారణమని పోలీసులు తెలిపారు. APK ఫైళ్లు, అనధికారిక లోన్ యాప్‌లు, పెట్టుబడి, ఆన్‌లైన్ బెట్టింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, సైబర్ నేరాలకు గురైతే 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.