News January 27, 2025

మెదక్: రూ.30 వేలు లంచం.. ఏసీబీకి దొరికాడు..!

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ సర్కిల్ అసిస్టెంట్ ఇంజినీర్ సీహెచ్.కృష్ణ <<15280332>>లంచం తీసుకుంటూ<<>> ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. వివరాలు.. ఎల్‌టీ కేటగిరీ-3 కింద 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.30 వేలు డబ్బులు డిమాండ్ చేశాడు. ముందు రూ.10 వేలు తీసుకోగా ఈరోజు మిగతా రూ.20 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. కృష్ణను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

Similar News

News July 6, 2025

ధర్మపురి : ‘పనుల నాణ్యతపై రాజీ ఉండకూడదు’

image

పనుల నాణ్యతపై రాజీ ఉండకూడదని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శనివారం ధర్మపురిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న గదులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. వైద్య సేవలు, శుభ్రతపై సమీక్షించి, అత్యవసర పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. కేంద్రం పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

News July 6, 2025

ధర్మపురి : ‘ప్రమాదకర గదులను వెంటనే కూల్చండి’

image

ప్రమాదకర గదులు వెంటనే కూల్చాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధర్మపురి మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన ఆయన.. ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. గదుల స్థితి దారుణంగా ఉండటాన్ని గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సానిటేషన్ పనులపై సమీక్షించి, డ్రైనేజీలు, కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

News July 6, 2025

జగిత్యాల :రేపటితో ముగియనున్న పీరీల పండుగ

image

జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో 11 రోజుల పాటు పెద్దపులి వేషధారణలతో జరుపుకున్న పీరీల పండుగ రేపటితో ముగియనుంది. నిన్న చిన్న సర్గత్తి పురస్కరించుకొని భక్తులు మట్కిలు తీసి మొక్కులు సమర్పించుకున్నారు. రేపు పెద్ద సర్గత్తి కావడంతో వేడుకలు అంబరాన్నంటనున్నాయి. రేపు తొలి ఏకాదశి కావడంతో పలు మండలాల్లో సోమవారం మొహర్రం పండుగ నిర్వహించనున్నారు.