News March 20, 2025

మెదక్: రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

image

శుక్రవారం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అయినప్పటికీ.. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News March 31, 2025

తూప్రాన్: గ్రూపు-1లో 17వ ర్యాంకు

image

తూప్రాన్ పట్టణానికి చెందిన బోయినిపల్లి ప్రణయ సాయి ఆదివారం ప్రకటించిన ర్యాంకుల్లో గ్రూపు -1లో 513 మార్కులతో రాష్ట్రస్థాయి 17వ ర్యాంకు సాధించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు విష్ణువర్ధన్, శ్రీవిద్య దంపతుల కుమారుడైన ప్రణయ్ సాయి గ్రూపు-lV ఫలితాల్లో 42 ర్యాంకు సాధించి చేగుంట రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్ -llలో 134, గ్రూపు -lllలో 148 ర్యాంకు సాధించాడు.

News March 31, 2025

మెదక్: గ్రూప్ -1లో 41వ ర్యాంక్ సాధించిన శైలేష్

image

టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్ – 1 ఫలితాల్లో మెదక్ పట్టణానికి చెందిన పూనా శైలేష్ 41వ ర్యాంక్ సాధించాడు. నిన్న తుది ఫలితాలు ప్రకటించగా 503.500 మార్కులు వచ్చాయి. కాగా 1 నుంచి 7వ తరగతి వరకు మెదక్ శివ సాయి స్కూల్, 8 నుంచి 10 అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ తూప్రాన్, ఇంటర్ నారాయణ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్, డిగ్రీ ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీలో చదివాడు. కాగా, గ్రామస్థుల నుంచి శైలేష్‌కు ప్రశంసలు వెల్లువెత్తాయి.

News March 31, 2025

మాసాయిపేట: విద్యుత్ షాక్‌తో మృతి

image

మాసాయిపేట మండలంలో విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. మాసాయిపేటకు చెందిన గౌరవగల్లు నరసింహులు (42) స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి జారిపడ్డాడు. అదే సమయంలో వాటర్ హీటరు పెట్టిన బకెట్లో చేయ్యిపడి విద్యుత్ షాక్ తగిలింది. విద్యుదాఘాతం ఏర్పడి నరసింహులు అక్కడికక్కడే మృతి చెందినట్లు భార్య సంతోషి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

error: Content is protected !!