News May 20, 2024

మెదక్: రైతులు అధైర్యపడొద్దు: భారతి హోలికేరి

image

నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోలికేరి అన్నారు. కొనుగోలు కేంద్రాల సమస్యలపై సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించి ఎగుమతి, దిగుమతి, మిల్లింగ్ స్టోరేజ్ కెపాసిటీ సమస్యల పరిష్కారంపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.

Similar News

News November 11, 2025

మెదక్: ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

image

భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శనీయమని అదనపు కలెక్టర్ నగేష్ కొనియాడారు. కలెక్టరేట్‌లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఆజాద్ జయంతి వేడుక నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్, అధికారులు, సిబ్బంది ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు నగేష్ తెలిపారు.

News November 11, 2025

మెదక్: సమస్యల సత్వర పరిష్కారానికి… లోక్ అదాలత్‌: ఎస్పీ

image

ఈ నెల 15న జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు కోరారు. త్వరగా, తక్కువ ఖర్చుతో, ఇరుపక్షాల సమ్మతితో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఈ లోక్ అదాలత్‌లో లభిస్తుందని ఎస్పీ తెలిపారు. క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్, ఆస్తి విభజన వంటి రాజీపడే అవకాశమున్న కేసులను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని ఆయన సూచించారు.

News November 10, 2025

మెదక్: ‘ఆరు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు’

image

సంచార పశువైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు 2017 సంవత్సరంలో పశు సంచార వైద్యశాలను అందించారు. ఇందులో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్, హెల్పర్లకు గత ఆరు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం వచ్చిన వెంటనే పశువులకు సేవలందిస్తున్న తమకు వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.