News June 28, 2024

మెదక్ రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే..

image

మెదక్ జిల్లా వడియారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల వివరాలు గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాకు చెందిన మేకల వ్యాపారులు చిక్వ రాజు (57), చిక్వ మనీష్ కుమార్(30), కూలీలు ఎండి ఇబ్రహీం(21), ఎండీ షబ్బీర్ ఖాన్(48), ఎండీ జీసన్(21)గా గుర్తించారు. క్షతగాత్రులు రేవా జిల్లాకు రమేష్, మహేష్, శుక్లాల్, మనీలాల్, మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన డ్రైవర్ బుట్టా సింగ్‌గా తేలింది.

Similar News

News November 24, 2025

మెదక్: రిజర్వేషన్ల ఖరారు.. గ్రామాల్లో వేడెక్కనున్న రాజకీయం

image

ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సంకల్పించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. గత నెలల్లో ప్రభుత్వం 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని చూసి ఆ దిశగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికల నోటిఫికేషన్ జారి చేసింది. అనూహ్యంగా హైకోర్టు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని తెలపడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఉపసంహరించుకుంది.

News November 24, 2025

మెదక్ జిల్లా జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అసీమ్ బిన్ అబ్దుల్లా

image

మెదక్ జిల్లా జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్న శంకరంపేట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అసీమ్ బిన్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. మొత్తం 54 ఓట్లు పోలవ్వగా ఆసీమ్ బిన్ అబ్దుల్లాకు 41 ఓట్లు, గీత అగర్వాల్ 13 ఓట్లు వచ్చాయి.
ఈ ఎన్నికలను స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించగా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేసన్న ఎన్నికల అధికారిగా వ్యవహారించారు.

News November 24, 2025

మెదక్ జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లు ఇలా..

image

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 21 మండలాల్లో మొత్తం 492 గ్రామ పంచాయతీలు ఉండగా.. 223 మహిళలకు రిజర్వు చేశారు. కేటగిరీ వారీగా చూస్తే 100 శాతం ఎస్టీ జనాభాలో 29 మహిళలకు, 42 ఎస్టీ జనరల్‌కు, 10 ఎస్టీ మహిళలకు, 11 ఎస్టీ జనరల్, ఎస్సీ జనాభాలో 33 మహిళలకు, 44 ఎస్సీ జనరల్‌కు, 49 బీసీ మహిళలకు, 59 బీసీ జనరల్, 102 అన్ రిజర్వుడ్ మహిళలకు, 113 అన్ రిజర్వుడ్ చేశారు.