News May 25, 2024
మెదక్: రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మెదక్ మండలం కాజిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్కు చెందిన మేకల మహేశ్ (35), హుస్నాబాద్లో జరిగిన ప్రమాదంలో కోహెడ మండలం రామచంద్రాపురంకు చెందిన దావ రాము (40), దుబ్బాక మండలం ఆరేపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో గంభీర్పూర్కు చెందిన పర్స కనకయ్య (56), గుమ్మడిదల వద్ద జరిగిన ప్రమాదంలో నక్క శ్రీశైలం (30) మృతి చెందారు.
Similar News
News November 26, 2025
మెదక్: రేపు స్థానిక సంస్థల పరిశీలకురాలు రాక

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ రేపు జిల్లాకు రానున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. ఆమె జిల్లా ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, అధికారుల సంసిద్ధతను సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకత, క్రమశిక్షణ కోసం అవసరమైన మార్గదర్శకాలు పరిశీలకులు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
News November 26, 2025
మెదక్: రేపు స్థానిక సంస్థల పరిశీలకురాలు రాక

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ రేపు జిల్లాకు రానున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. ఆమె జిల్లా ఎన్నికల ప్రక్రియ, నిర్వహణ, అధికారుల సంసిద్ధతను సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకత, క్రమశిక్షణ కోసం అవసరమైన మార్గదర్శకాలు పరిశీలకులు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
News November 26, 2025
మెదక్ కలెక్టరేట్లో మీడియా సెంటర్ ప్రారంభం

మెదక్ కలెక్టరేట్లో మీడియా సెంటర్ను డీపీఆర్ఓ రామచంద్రరాజుతో కలిసి జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై మీడియా సెంటర్ ద్వారా నిఘా పెట్టనున్నట్లు పేర్కొన్నారు.


