News March 21, 2025

మెదక్: విద్యార్థులకు అన్ని వసతులు: కలెక్టర్

image

పది పరీక్షలు జరిగే ప్రదేశాలలో 163 BNSS సెక్షన్ ఉంటుందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు 68 కేంద్రాలలో 10,388 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ 3, సిట్టింగ్ స్క్వాడ్లు 17, చీఫ్ సూపరింటెండెంట్ 68, డిపార్ట్మెంటల్ అధికారులు 70, మంది 590 ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులతో ఏర్పాట్లు చేశామన్నారు.

Similar News

News November 17, 2025

నర్సాపూర్: ‘బాల్య వివాహాలపై సమాచారం ఇవ్వండి’

image

బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి హెచ్చరించారు. బాల్య వివాహాలపై ఆదివారం నర్సాపూర్‌లో ఫంక్షన్ హాల్ యజమానులు, ఫోటోగ్రాఫర్లు, పురోహితులు, బ్యాండ్ బాజా వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మైనర్ బాలబాలికలకు వివాహాలు జరిగితే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వివాహాలు చేసే ముందు వారి వయసు వివరాలను తప్పనిసరిగా సేకరించాలని తెలిపారు.

News November 16, 2025

కుటుంబానికి మూలశక్తి స్త్రీ: సత్యవాణి

image

భారతీయ కుటుంబానికి మూలశక్తి స్త్రీయే అని సామాజిక ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి అన్నారు. రామాయంపేట శిశు మందిర్లో సప్తశక్తి సంగం నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడలేని కుటుంబ వ్యవస్థ కేవలం మన భారతదేశంలోనే ఉందన్నారు. కుటుంబ బాధ్యతను అత్యంత సమర్థంగా నిర్వహించే శక్తి మహిళకే ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో మహిళ పాత్రే అత్యంత కీలకమన్నారు.

News November 16, 2025

రేపటి నుంచి జిన్నింగ్ మిల్లులు బంద్: డీఎంఓ నాగరాజు

image

మెదక్ జిల్లాలో జిన్నింగ్(పత్తి) మిల్లుల బంద్ కారణంగా సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. కావున సమస్య పరిష్కారం అయ్యేవరకు రైతులు తమ పత్తిని మిల్లులకు తీసుకురావద్దని జిల్లా మార్కెటింగ్ అధికారి కే.నాగరాజు సూచించారు. సీసీఐ వారు జిన్నింగ్ మిల్లుల కేటాయింపులో L1, L2 పద్ధతిని అనుసరించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగినట్లు ఆయన తెలిపారు.