News March 9, 2025
మెదక్: విషాదం.. మామ, కోడలు మృతి

మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో ఒకేరోజు మామ, కోడలు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మక్కరాజుపేటకు చెందిన ఆరేళ్ల సుమలత (35) వారం రోజుల క్రితం అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి మామ పోచయ్య (65) తీసుకువెళ్తున్నాడు. మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం జరగగా పోచయ్య గాయపడ్డాడు. చికిత్స పొందుతున్న పోచయ్య ఈరోజు మృతిచెందగా, అస్వస్థతకు గురైన కోడలు సైతం మృతి చెందింది.
Similar News
News February 8, 2026
పిట్లం: కూలి డబ్బుల కోసం హత్య

పిట్లంలో ఈ నెల <<19069742>>6న జరిగిన హత్య<<>> కేసును పోలీసులు ఛేదించారు. బాన్సువాడ DSP విఠల్ రెడ్డి వివరాలు వెల్లడించారు. UPకి చెందిన రాజేశ్, శ్రీకృష్ణ పెయింటింగ్ పనుల కోసం పిట్లం వచ్చారు. కూలీ డబ్బుల విషయంలో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో రాజేశ్ను శ్రీకృష్ణ కర్రతో కొట్టి హత్య చేసి పరారయ్యాడు. నిందితుడు ఊరు విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News February 8, 2026
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News February 8, 2026
విద్యార్థులకు అస్వస్థత.. కారకులపై CM సీరియస్

AP: పోలవరం(D) దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి గల కారకులపై CM CBN ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. బాధ్యులపై శాఖాపరమైన, అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా నిన్న టిఫిన్ చేశాక 92మంది విద్యార్థులకు కడుపునొప్పి, జ్వరం రావడంతో ఆస్పత్రులకు తరలించామని అధికారులు వివరించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కుదుటపడిందన్నారు.


