News May 24, 2024

మెదక్: వృద్ధుడి మృతిపై అనుమానాలు.. రూ.15 లక్షల సుఫారీ..?

image

మెదక్ జిల్లా శివంపేట మండలం పోతులబోగూడా గ్రామంలో ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన పోచయ్య ది హత్యగా బంధువులు అనుమానిస్తున్నారు. భూ తగాదాల నేపథ్యంలో కొందరు వ్యక్తులు రూ.15 లక్షల సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోచయ్య బంధువులు పోర్కొంటూ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

Similar News

News February 16, 2025

మెదక్: భార్య మృతిని తట్టుకోలేక భర్త సూసైడ్

image

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చిలిపిచేడ్‌లో జరిగింది. ఎస్ఐ నర్సింహులు వివరాలు.. HYDకి చెందిన జగన్ రావు(60) భార్య మూడు నెలల కింద మృతి చెందడంతో మనస్థాపం చెంది మండలంలోని చిట్కుల్ శివారులో చాముండేశ్వరీ ఆలయ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు సంతోశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News February 16, 2025

మెదక్: తమ్ముడిని కొట్టి చంపి.. ఆపై!

image

తమ్ముడిని హత్య చేసిన అన్నను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. మునిపల్లి మండలం చీలపల్లి చెందిన శివయ్యను శుక్రవారం సాయంత్రం తన అన్న యాదయ్య హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం యాదయ్య పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. విచారణలో శివయ్యను బండరాయితో కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడని, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

News February 16, 2025

MDK: మ్యాట్రిమోని పేరుతో డబ్బులు వసూలు.. నిందితుడి అరెస్ట్

image

మ్యాట్రిమోని పేరుతో అమ్మాయిలతో పరిచయం పెంచుకొని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నిందితుడిని చేర్యాల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చేర్యాల సీఐ తెలిపిన వివరాలు.. కర్నూల్‌కు చెందిన గుమ్మనా వివేకానంద రెడ్డి చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత అమ్మాయి నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేసినట్టు తెలిపారు. మోస పోయిన అమ్మాయి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.

error: Content is protected !!